Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ బోర్డర్‌ను తలపిస్తున్న తుళ్ళూరు - భారీగా పోలీసు బలగాలు

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (10:43 IST)
అమరావతి ప్రాంతమైన తుళ్లూరు ప్రాంతం పాకిస్థాన్ సరిహద్దులను తలపిస్తోంది. రాజధాని కోసం రైతులు చేపట్టిన ఉద్యమ రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. దీంతో ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని పోలీసు బలగాలతో అణిచివేయాలని భావిస్తోంది. ఇందులోభాగంగా, భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. 
 
దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ ట్వీట్ చేస్తూ వీడియోను షేర్ చేశారు. "రాజధాని గ్రామాలు బోర్డర్‌ని తలపిస్తున్నాయి. పాకిస్థాన్ బోర్డర్‌లో కూడా ఇంత మంది పోలీసులు ఉండరు. అన్యాయంగా, క్రూరంగా పోలీసు బలంతో ఉద్యమాన్ని అణిచివెయ్యాలని జగన్‌ యుద్ధ వాతావరణం తీసుకొస్తున్నారు. 
 
వైకాపా ప్రభుత్వం ఎంత అణిచివేస్తే ఉద్యమం అంత ఉగ్రరూపం దాలుస్తుంది. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతులను రెచ్చగొట్టే చర్యలు వైకాపా ప్రభుత్వం మానుకోవాలి" అని ట్వీట్ చేశారు. అలాగే, రైతులు చేపట్టిన ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతునిచ్చిందని ఆయన గుర్తుచేశారు.

 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments