Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉండవల్లి కాల్ మనీ కింగ్ ... చంపేస్తాన‌ని బెదిరింపులు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (11:02 IST)
సాక్షాత్తు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొలువైన తాడేప‌ల్లి ప్రాంతంలో కాల్ మ‌నీ వ్యాపారం కోర‌లు చాస్తోంది. ఈ ప్రాంతంలో కాల్ మ‌నీ కింగ్ గా పేరొందిన ఒక వ్య‌క్తిపై తాడేప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదులు అందాయి. 
 
 
ఉండవల్లి చెందిన మణికంఠ అనే కాల్ మనీ వ్యాపారి మ‌ణికంఠ‌పై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భారీ వ‌డ్డీకి న‌గ‌దు అప్పుగా ఇచ్చి, ఇప్ప‌టికిప్పుడు నగదు చెల్లించకపోతే రౌడీషీటర్ల చేత చంపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు మణికంఠపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఇల్లు అమ్మి డబ్బులు చెల్లిస్తానని ప్రాధేయపడ్డా కాల్ మనీ కింగ్ కనికరించడం లేద‌ని  పేర్కొంటున్నారు.
 
బాధితుడి ఇల్లు ఆక్రమించిన మణికంఠ, ఖాళీ చేయమంటే దిక్కున చోట చెప్పుకోవాలంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఫిర్యాదు చేశారు. బాధితులు ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించారు. మణికంఠపై అనేక అక్రమ వ్యాపారాల ఆరోపణలున్నాయి. గత కొంతకాలంగా కాల్ మని, అక్రమ వడ్డీ వ్యాపారాలకు ఉండ‌వ‌ల్లి కేంద్రంగా మారింది. దీనిపై పోలీసులు దృష్టి పెట్టాల‌ని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments