Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల‌న ప‌క్క‌న పెట్టి... రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఏపీ సీఎం : ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

Webdunia
బుధవారం, 11 మే 2016 (18:17 IST)
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిప‌డ్డారు. తెలంగాణాలో అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా, చంద్ర‌బాబు  మాట్లాడకపోవటం దురదృష్టకరమ‌ని, చంద్రబాబు హయాంలోనే బ్రిజేష్ ట్రిబ్యూనల్లో ఏపీకి నీటి కేటాయింపులో అన్యాయం జరిగింద‌ని విమ‌ర్శించారు. 
 
తెలంగాణ సర్కార్ నిర్మించే పాలామూర్ - డిండి ప్రాజెక్టుల వల్ల ఏపీకి 120 టీఎంసిల నష్టం జ‌రుగుతోంద‌న్నారు. సీడ‌బ్ల్యూసీ అనుమతులు లేకుండా టీ సర్కార్ ప్రాజెక్టులు నిర్మిస్తున్న బాబు ప్రశ్నించకపోవడం దారుణమ‌ని, తెలంగాణా ప్రభుత్వంతో బాబు అంతర్గత ఒప్పందం చేసుకున్నార‌ని ఆరోపించారు. 
 
అనుమతులులేని ప్రాజెక్టులు ఆపకపోతే, రాయలసీమ ఎడారి కావడం ఖాయ‌మ‌ని ఎమ్మెల్యే చెప్పారు. కేసీయార్ ప్ర‌భుత్వం నీళ్ళు దోచుకుంటున్నా ఆఖిలపక్షం ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేట‌న్నారు. పాలన పక్కన పెట్టి రెండేళ్లుగా ఏపీ సీఎం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. అందుకే జ‌గ‌న్ ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం మే 16,17,18  తేదీల‌లో కర్నూలులో దీక్ష చేస్తున్నార‌న్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments