Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా దుకాణం మూసేస్తామంటున్న బుద్ధా వెంకన్న!

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (15:03 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నా సవాల్ విసిరారు. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ప్రజాక్షేత్రానికి వెళ్లి ఎన్నికల్లో తలపడాలని పిలుపునిచ్చారు. ఒకవేళ ఆ ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడిపోతే తమ పార్టీని మూసేస్తామని ప్రకటించారు. 
 
చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నాయుడుని తిరుపతి పోలీసులు రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకున్న విషయం తెల్సిందే. ఇది సీఎం జగన్ పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబే తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడన్న భయం జగన్‌లో మొదలైందన్నారు. జగన్‌కు నిజంగా ప్రజాబలముంటే తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. 
 
అసలు ఆ ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఆదరిస్తే, టీడీపీని మూసేస్తామని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. ప్రజాబలంతో టీడీపీ విజయం సాధిస్తే, వైసీపీ దుకాణం కట్టేయడానికి జగన్ సిద్ధమేనా? అని ప్రశ్నించారు. దుష్టశక్తులపై పోరాడే విషయంలో చంద్రబాబు వెనకడుగు వేయరనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments