Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన గంటల వ్యవధిలో వరుడు మృతి

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (17:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో పెళ్లయిన కొన్ని గంటల వ్యవధిలోనే వరుడు శివకుమార్ దుర్మరణం పాలయ్యారు. 
 
శనివారం తెల్లవారుజామున రోడ్డుపై వెళ్తుండగా వెలుగోడు మండలంలోని మోత్కూరు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని శివకుమార్‌ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 
 
కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే శివకుమార్‌ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments