Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ అరెస్టు : రేవంత్ సర్కారు తొందరపడింది : బొత్స

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (10:12 IST)
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన కేసులో హీరో అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేసి అరెస్టు చేయడంతో వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ మండిపడ్డారు. హీరో అల్లు అర్జున్ అరెస్టు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సర్కారు తొందరపడిందని వ్యాఖ్యానించారు. 
 
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతికి ఒక వ్యక్తిని మాత్రమే బాధ్యుడిని చేసి అరెస్టు చేయడం సరికాదన్న వాదనలు బలంగా వినిపిస్తుండగా, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం తొందరపాటు చర్యకు పాల్పడిందన్నారు. గతంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారని, ఆ ఘటనకు ఎవర్ని బాధ్యులుగా చేశారని బొత్స ప్రశ్నించారు. సున్నితమైన అంశాల్లో చర్యలు తీసుకునేటప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచించి అడుగేయాలని హితవు పలికారు. 
 
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం బాధాకరమని, కానీ అధికారంలో ఉన్నవాళ్లు సంయమనం పాటించాలని సూచించారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందని, పోలీసు ఉన్నతాధికారులు కూడా అన్ని కోణాల్లో ఆలోచన చేసి తగిన విధంగా నడుచుకోవాలని భావిస్తున్నట్టు బొత్స తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments