Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ అరెస్టు : రేవంత్ సర్కారు తొందరపడింది : బొత్స

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (10:12 IST)
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన కేసులో హీరో అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేసి అరెస్టు చేయడంతో వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ మండిపడ్డారు. హీరో అల్లు అర్జున్ అరెస్టు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సర్కారు తొందరపడిందని వ్యాఖ్యానించారు. 
 
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతికి ఒక వ్యక్తిని మాత్రమే బాధ్యుడిని చేసి అరెస్టు చేయడం సరికాదన్న వాదనలు బలంగా వినిపిస్తుండగా, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం తొందరపాటు చర్యకు పాల్పడిందన్నారు. గతంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారని, ఆ ఘటనకు ఎవర్ని బాధ్యులుగా చేశారని బొత్స ప్రశ్నించారు. సున్నితమైన అంశాల్లో చర్యలు తీసుకునేటప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచించి అడుగేయాలని హితవు పలికారు. 
 
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం బాధాకరమని, కానీ అధికారంలో ఉన్నవాళ్లు సంయమనం పాటించాలని సూచించారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందని, పోలీసు ఉన్నతాధికారులు కూడా అన్ని కోణాల్లో ఆలోచన చేసి తగిన విధంగా నడుచుకోవాలని భావిస్తున్నట్టు బొత్స తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments