Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొత్స సత్యనారాయణ పెయిడ్ ఆర్టిస్ట్.. అన్నదెవరు?

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (20:45 IST)
మంత్రి బొత్స సత్యనారాయణపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ. అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటున్న బొత్స సత్యనారాయణే పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ధ్వజమెత్తారు. రైతులను కించపరిచే విధంగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 
 
అమరావతి ఉద్యమం 300వ రోజుకు చేరుకున్న సంధర్భంగా తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన దీక్ష చేపట్టారు సిపిఐ నారాయణ. రైతులు విమానాలు ఎక్కి తమ సమస్యను చెప్పుకునేందుకు వెళ్ళకూడదా అంటూ ప్రశ్నించారు. న్యాయవ్యవస్ధలపై వ్యాఖ్యలు చేయడం మొత్తం కూడా న్యాయవ్యవస్ధపై దాడిగా భావిస్తున్నామన్నారు. 
 
న్యాయవ్యవస్ధపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు నారాయణ. రాజధానిగా అమరావతిగా ఉండాలని రైతులను ఆందోళన చేయొచ్చు.. మూడు రాజధానులు అవసరమని అధికార పార్టీ నేతలు చెప్పుకోవచ్చు.. అంతేగానీ ఉద్యమాలను అణచివేసే విధంగా హేళనగా మాట్లాడడం మాత్రం మానుకోవాలంటూ వైసిపి నేతలను హెచ్చరించారు సిపిఐ నేత నారాయణ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments