బోస్టన్ కమిటీ... ఓ బోగస్ కమిటీ: తెదేపా

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (21:42 IST)
రాజధానుల ప్రతిపాదనపై వైకాపా ప్రభుత్వం నియమించిన బోస్టన్ కమిటీ... ఓ బోగస్ కమిటీ అని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఎఫ్​బీఐ కేసులున్న కంపెనీకి సీబీఐ కేసులున్న వైకాపా నేతలు రాజధాని బాధ్యతుల అప్పగించారని విమర్శించారు.

విజయసాయిరెడ్డి అల్లుడికి బోస్టన్ గ్రూప్ ఛైర్మన్ మిత్రుడు కావటం వలనే రాజధానుల బాధ్యత ఆ కంపెనీకి ఇచ్చారని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. రాజధానుల గురించి వేసిన బోస్టన్ కమిటీపై ఎఫ్​బీఐ కేసులు ఉన్నాయని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు.

మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆమె ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎఫ్‌బీఐ కేసులు ఉన్న కంపెనీకి సీబీఐ కేసులు ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి... బాధ్యత ఇచ్చారని విమర్శించారు. ఫొక్స్‌వ్యాగన్‌, సారా కేసుల ఆరోపణలు ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ... బోస్టన్ కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకుంటారా అని అనురాధ నిలదీశారు.

రాజధాని రైతులు, ఉత్తరాంధ్ర అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత కక్షని మండిపడ్డారు. రాజధాని విషయంలో న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని వైకాపా నేతలు కొత్త కథలు చెబుతున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు

యుఫోరియా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను : భూమిక

జియో స్టార్‌లో ప్ర‌భాస్ .. ది రాజా సాబ్ ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

తర్వాతి కథనం
Show comments