Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది మీ ఇల్లు అనుకోండి బాబు... అపుడపుడూ ఢిల్లీకి రండి..

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (09:05 IST)
సుధీర్ఘకాలం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. శనివారం ప్రధాని మోడీ నేతృత్వంలోని ఆజాదీ కా అమృత్ మహోత్సవ జాతీయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు ప్రధానితో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 
 
ఈ సమావేశానికి హాజరైన వారంతా తేనీరు సేవిస్తుండగా, ప్రధాని అందరి వద్దకు వచ్చి పలకరించినట్లు తెలిసింది. చంద్రబాబు దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిసేపు పక్కకు జరిగి ఇద్దరూ 5 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. 'మీరీ మధ్య ఢిల్లీకి రావడంలేదు. అప్పుడప్పుడూ వస్తూ ఉండండి' అని బాబుతో ప్రధాని అన్నట్లు తెదేపా వర్గాలు తెలిపాయి. 
 
అలాగే, ఈ సారి ఢిల్లీకొచ్చినప్పుడు ప్రత్యేకంగా కలుస్తానని చంద్రబాబు చెప్పగా, 'తప్పకుండా రండి. ఇది మీ ఇల్లు అనుకోండి. రావాలనుకున్నప్పుడు ముందుగా మా ఆఫీసుకు చెప్పండి' అన్నట్లు సమాచారం. చంద్రబాబు కుటుంబసభ్యుల యోగక్షేమాలను అడిగినట్లు తెలిసింది. 
 
కేంద్ర మంత్రులు అమిత్‌ షా, గడ్కరీ తదితరులతోనూ బాబు ప్రత్యేకంగా మాట్లాడారని తెదేపా వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ భేటీ వచ్చే 2024 ఎన్నికల్లో టీడీపీ బీజీపీల మధ్య దోస్తీకి దారితీయొచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments