Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది మీ ఇల్లు అనుకోండి బాబు... అపుడపుడూ ఢిల్లీకి రండి..

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (09:05 IST)
సుధీర్ఘకాలం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. శనివారం ప్రధాని మోడీ నేతృత్వంలోని ఆజాదీ కా అమృత్ మహోత్సవ జాతీయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు ప్రధానితో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 
 
ఈ సమావేశానికి హాజరైన వారంతా తేనీరు సేవిస్తుండగా, ప్రధాని అందరి వద్దకు వచ్చి పలకరించినట్లు తెలిసింది. చంద్రబాబు దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిసేపు పక్కకు జరిగి ఇద్దరూ 5 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. 'మీరీ మధ్య ఢిల్లీకి రావడంలేదు. అప్పుడప్పుడూ వస్తూ ఉండండి' అని బాబుతో ప్రధాని అన్నట్లు తెదేపా వర్గాలు తెలిపాయి. 
 
అలాగే, ఈ సారి ఢిల్లీకొచ్చినప్పుడు ప్రత్యేకంగా కలుస్తానని చంద్రబాబు చెప్పగా, 'తప్పకుండా రండి. ఇది మీ ఇల్లు అనుకోండి. రావాలనుకున్నప్పుడు ముందుగా మా ఆఫీసుకు చెప్పండి' అన్నట్లు సమాచారం. చంద్రబాబు కుటుంబసభ్యుల యోగక్షేమాలను అడిగినట్లు తెలిసింది. 
 
కేంద్ర మంత్రులు అమిత్‌ షా, గడ్కరీ తదితరులతోనూ బాబు ప్రత్యేకంగా మాట్లాడారని తెదేపా వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ భేటీ వచ్చే 2024 ఎన్నికల్లో టీడీపీ బీజీపీల మధ్య దోస్తీకి దారితీయొచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments