Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముర్ము ఇంటికి ప్రధాని మోడీ.. కొత్త రాష్ట్రపతికి స్వీట్లు తినిపించిన అమిత్ షా

murmu - modi
, గురువారం, 21 జులై 2022 (22:15 IST)
భారత రాష్ట్రపతిగా అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు పూర్తికాకుండానే తన సమీప ప్రత్యర్థి విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో ముర్ము విజయం సాధించారు.
webdunia
 
మరోవైపు, రాత్రి 8 గంటల సమయంలోనే ముర్ము తన విజయానికి సరిపడ మేర ఓట్లను సాధించారన్న సమాచారం తెలియాగనే ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా ఆమె నివాసానికి వెళ్ళారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బీజేపీ జాతీయ చీఫ్ నడ్డాతో కలిసి ముర్ముకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందలు తెలిపారు. 
 
ఈ సందర్భంగా ముర్ము వ్యక్తిత్వాన్ని, విజయాన్ని ఆకాశానికెత్తిన ప్రధాని నరేంద్ర మోడీ ఆమెకు ఓటు వేసిన ప్రజా ప్రతినిధులకు అభినందిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
webdunia
 
ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి అక్కడకు వచ్చి ముర్ముకు అభినందలు తెలిపారు. తన చేతులతో ఆమెకు మిఠాయి తినిపించారు. ఈ ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమిత్ షా అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‍‌నాథ్ సింగ్ కూడా అక్కడకు చేరుకుని ముర్ముకు అభినందనలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లెక్కింపు పూర్తికాకుండానే ఓటమిని అంగీకరించిన యశ్వంత్ సిన్హా