Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రైళ్లకు బాంబు బెదిరింపులు.. 2 గంటల పాటు ఆలస్యంగా రైళ్లు

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (17:06 IST)
ఏపీలోని విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వచ్చే రైళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ రైళ్లలో  బాంబులు పెట్టినట్లు బెదిరింపు ఫోన్‌ కాల్ రావడం తీవ్ర కలకలం రేపింది.
 
ఈ మేరకు ఓ ఆగంతకుడు డయల్‌ 100కు ఫోన్‌ చేసి చెప్పాడు. ఆగంతుకుడి ఫోన్‌ కాల్‌తో ఈ మార్గంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కాజీపేటలో లోకమాన్య తిలక్ టెర్మినస్ ట్రైన్, చర్లపల్లి వద్ద కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లను ఆపి తనిఖీలు చేపట్టారు.
 
మొత్తం రైలు బోగీల్లోని అనుమానాస్పద వస్తువులు, బ్యాగులను జాగిలాలతో తనిఖీ చేశారు. కానీ బాంబుకు సంబంధించి ఆనవాళ్లు లేకపోవడంతో రైళ్లను పంపేశారు. ఈ క్రమంలోనే బెదిరింపును పోలీసులు ఫేక్‌కాల్‌గా తేల్చారు. 
 
మరోవైపు బాంబు బెదిరింపు కాల్‌తో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తనిఖీల కారణంగా రెండు రైళ్లూ సుమారు 2 గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.  

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments