Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి - పాపికొండల నడుమ ప్రారంభమైన బోటింగ్

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (11:35 IST)
గోదావరి నది, పాపికొండల మధ్య బోటింగ్ ఆదివారం నుంచి ప్రారంభమైంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిలిపివేసిన బోటింగ్‌కు ఏపీ ప్రభుత్వం ఆదివారం నుంచి అనుమతి ఇచ్చింది. దీంతో నేటి నుంచి పాపికొండల మధ్య బోటింగ్ ప్రారంభమైంది. 
 
రాజమండ్రి నుంచి వర్చువల్‌గా పాపికొండల బోట్లను ఏపీ పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. పాపికొండల విహారయాత్ర పర్యవేక్షణకు ఐదు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి పర్యాటక బోట్లకు ఎస్కార్ట్ బోట్ తప్పని సరిచేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడిచే బోట్లకు కళ్ళెం పడింది.
 
రెండేళ్ల కిందట కచ్చులూరు ఘటన తీవ్రవిషాదం నింపింది. దీంతో యాత్ర నిలిచిపోయింది. ఈ ఏడాది పునఃప్రారంభించారు. వరదల కారణంగా కొంతకాలం ఆగిన పాపికొండలు విహారయాత్ర ఆదివారంనుంచి ప్రారంభమైంది. దీంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
పాపికొండల యాత్రకు వెళ్లాలంటే ఏపీ టూరిజం ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా టికెట్లు తీసుకోవాలి. సొంత వాహనాలు లేని సందర్శకులు రాజమహేంద్రవరం సరస్వతీఘాట్‌లో ఉన్న పర్యాటక శాఖ కార్యాలయానికి ఉదయం 6.30కు చేరుకోవాలి. పర్యాటకులను అక్కడినుంచి గండిపోచమ్మ బోటింగ్‌ పాయింట్‌ వరకు వాహనంలో తీసుకెళ్తారు. యాత్ర అక్కడినుంచే మొదలవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిట్మెంట్ ఇస్తే ఓ రేటు.. ఇవ్వకపోతే మరో రెన్యురేషనా? ఘాటుగా రిప్లై ఇచ్చిన అనన్య నాగళ్ల (Video)

అభద్రతా భావంలో సల్మాన్ ఖాన్ ... భద్రత రెట్టింపు - బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనం దిగుమతి!!

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా చేయాల్సినవి ఏమిటి?

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments