Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్న ఒక్కసారి లేవమ్మా.. బోటు ప్రమాదంలో మృతి చెందిన హాసిని..

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (11:50 IST)
నాన్న ఒక్కసారి లేవమ్మా.. నీకు ఇష్టమైన చీర తీసుకొచ్చాను.. ఒక్కసారి చూడమ్మా అంటూ బోటు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి హాసిని తల్లి మధులత బోరున విలపిస్తున్న తీరు తిరుపతి స్థానికులను కలచి వేస్తోంది. మూడురోజుల క్రితం పాపికొండలలో జరిగిన బోటు ప్రమాదంలో సుబ్రమణ్యం కుటుంబం కనిపించకుండా పోయారు. సుబ్రమణ్యం భార్య మధులత మాత్రం సురక్షితంగా బయటపడింది. కానీ, భర్త సుబ్రమణ్యం, అతని కుమార్తె హాసిని మాత్రం కనిపించకుండా పోయారు. 
 
రెండురోజుల పాటు ఎన్టీఆర్‌ఎఫ్ బలగాలు రెస్క్యూ నిర్వహించి మృతదేహాలను బయటకు తీశారు. భర్త, కుమార్తె మృతదేహాలను చూసిన మధులత చలించిపోయింది. తీవ్ర ఆవేదనకు గురైంది. మంగళవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా నుంచి తిరుపతికి హాసిని మృతదేహాన్ని తీసుకొచ్చారు. అక్కారంపల్లిలోని రాదేశ్ శ్యామ్ అపార్టుమెంట్‌లో పార్థీవదేహాన్నిసందర్శనార్ధం ఉంచారు. సుబ్రమణ్యం మృతదేహాన్ని చిత్తూరు సమీపంలోని పూతలపట్టు వద్దనున్న వేపనపల్లెకు తీసుకెళ్ళారు. సాయంత్రం అంత్యక్రియలు జరుగనున్నాయి. కాగా, ఈ నెల 16వ తేదీన హాసిని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సి వుండగా, బోటు ప్రమాదంలో జలసమాధి అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments