Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్న ఒక్కసారి లేవమ్మా.. బోటు ప్రమాదంలో మృతి చెందిన హాసిని..

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (11:50 IST)
నాన్న ఒక్కసారి లేవమ్మా.. నీకు ఇష్టమైన చీర తీసుకొచ్చాను.. ఒక్కసారి చూడమ్మా అంటూ బోటు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి హాసిని తల్లి మధులత బోరున విలపిస్తున్న తీరు తిరుపతి స్థానికులను కలచి వేస్తోంది. మూడురోజుల క్రితం పాపికొండలలో జరిగిన బోటు ప్రమాదంలో సుబ్రమణ్యం కుటుంబం కనిపించకుండా పోయారు. సుబ్రమణ్యం భార్య మధులత మాత్రం సురక్షితంగా బయటపడింది. కానీ, భర్త సుబ్రమణ్యం, అతని కుమార్తె హాసిని మాత్రం కనిపించకుండా పోయారు. 
 
రెండురోజుల పాటు ఎన్టీఆర్‌ఎఫ్ బలగాలు రెస్క్యూ నిర్వహించి మృతదేహాలను బయటకు తీశారు. భర్త, కుమార్తె మృతదేహాలను చూసిన మధులత చలించిపోయింది. తీవ్ర ఆవేదనకు గురైంది. మంగళవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా నుంచి తిరుపతికి హాసిని మృతదేహాన్ని తీసుకొచ్చారు. అక్కారంపల్లిలోని రాదేశ్ శ్యామ్ అపార్టుమెంట్‌లో పార్థీవదేహాన్నిసందర్శనార్ధం ఉంచారు. సుబ్రమణ్యం మృతదేహాన్ని చిత్తూరు సమీపంలోని పూతలపట్టు వద్దనున్న వేపనపల్లెకు తీసుకెళ్ళారు. సాయంత్రం అంత్యక్రియలు జరుగనున్నాయి. కాగా, ఈ నెల 16వ తేదీన హాసిని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సి వుండగా, బోటు ప్రమాదంలో జలసమాధి అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments