Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్యుతాపురం సెజ్‌లో పేలుడు.. ఇద్దరు మృతి

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2023 (18:42 IST)
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరోమారు భారీ ప్రమాదం జరిగింది. సాహితీ ఫార్మాలో పేలుడు సంభవించింది. దీంతో ఘటనా స్థలిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ సెజ్‌‍లోని భారీ శబ్దంతో పేలిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా మరికొందరు గాయపడ్డారు. భారీ శబ్దాలు రావడంతో ఉద్యోగులు, కార్మికులు, స్థానికులు ప్రాణభయంతో దూరంగా పరుగులు తీశారు. 
 
ఈ ఘటన గురించిన సమాచారం అందుకున్న అగ్నిమాదకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. గత జనవరిలో కూడా లాలంకోడూరు సమీపంలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్‌లో పేలింది. ఈ ప్రమాదంలో ఒక చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments