విశాఖ రాజధానితో సీమ వాసులకు ఇబ్బందులు... ఉద్యమాలు తప్పవు : టీజీ వెంకటేష్

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (16:05 IST)
విశాఖను ఏపీ రాజధానిగా చేయడం వల్ల రాయలసీమ ప్రాంత వాసులకు ఒరిగేది ఏమీ లేదని, తీవ్రమైన ఇబ్బందులు తప్పవని టీడీపీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు. 
 
నవ్యాంధ్ర రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన విషయం తెల్సిందే. దీంతో రాజధాని ప్రాంతంలో రాజధాని చిచ్చు చెలరేగింది. ఇది చల్లారకముందే రాయలసీమ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు ఇపుడు సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. గ్రేటర్ రాయలసీమ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలన్నది వారి ప్రతిపాదనగా ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు ఓ లేఖ రాశారు. 
 
పరిపాలన వికేంద్రీకరణను సమర్ధిస్తున్నామని చెబుతూనే, శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం హైకోర్టు ఏర్పాటు హర్షణీయమని సీమ నేతలు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై సీమ ప్రాంతానికి చెందిన సీనియర్ నేతలైన గంగుల ప్రతాప్‌రెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, శైలజానాథ్‌, చెంగారెడ్డి, మాజీ డీజీపీలు ఆంజనేయరెడ్డి, దినేష్‌రెడ్డి సంతకాలు చేశారు. 
 
కాగా, బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ మాత్రం మరో ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. విశాఖలోనే రాజధాని ఉంటే రాయలసీమ వాసులకు ఇబ్బందులు తప్పవని, ఉద్యమాలు మొదలయ్యే అవకాశం ఉందని టీజీ చెప్పారు. హైకోర్టు రావడం వల్ల సీమ ప్రాంతానికి ఎలాంటి లాభం ఉండదన్నారు. పైగా, కర్నూలు, అమరావతి ప్రాంతాల్లో మినీ సచివాలయాలను నిర్మించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments