Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే జోన్‌పై రైల్వే బోర్డు ఛైర్మన్‌ త్రిపాఠితోనే ప్రకటన చేయిస్తా : జీవీఎల్

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (15:16 IST)
ఏపీ విభజన హామీల్లో ఒకటైన విశాఖపట్టణంకు రైల్వే జోన్ అంశంపై రైల్వే బోర్డు ఛైర్మన్ త్రిపాఠీతోనే ఒక ప్రకటన చేయిస్తానని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు అన్నారు. 
 
విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం చేతులెత్తేసిందంటూ వార్తా కథనాలు వచ్చాయి. వీటిపై జీవీఎల్ స్పందించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా కొన్ని మీడియా సంస్థలు అసత్య కథనాలను ప్రచురిస్తున్నాయని ఆరోపించారు. రైల్వే జోన్ అంశంపై రైల్వే బోర్డు ఛైర్మన్‌ త్రిపాఠీతో ప్రకటన చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటనను చదివి వినిపించారు. 
 
విభజన హామీల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని చర్చించాలన్నారు. కేవలం వ్యక్తిగత సమస్యల కోసమే కలుసుకుంటారా? అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో ఒకలా ఢిల్లీలో ఒకలా వైకాపా, తెరాస అధినేతలు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌లు డ్రామాలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments