Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్య బాబోయ్.. అమిత్ షా ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వలేదంటే నమ్మరే : వీర్రాజు

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేసినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు మీడియాలో వచ్చిన వార్తలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (15:50 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేసినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు మీడియాలో వచ్చిన వార్తలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. అమ్మతోడుగా, తమ పార్టీ అధినేత అమిత్ షా ఫోన్ చేసి హెచ్చరించలేదని స్పష్టంచేశారు. 
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, షా తనను మందలించారని వస్తున్న వార్తల్లో రవ్వంత కూడా వాస్తవం లేదన్నారు. కావాలంటే తన కాల్‌డేటా చెక్ చేసుకోవచ్చన్నారు. తన గొంతును నొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు. తనను వైసీపీ కోవర్టు అంటూ చేస్తున్న ఆరోపణలు వింటుంటే నవ్వొస్తోందని చెప్పారు. 
 
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని ఏపీ హక్కుల కోసం జేఏసీని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేపట్టడం మంచిదేనన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణం నెలకొందని దానికి చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments