Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వార్డ్ మెంబర్‌గా గెలవడం కూడా చేతకాదు.. ఎమ్మెల్సీని చేశాం: బుద్ధా వెంకన్న

రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని.. అందుకే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయ్యి చూపిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీంతో టీడీపీ బీజేపీకి కటీఫ్ ఇవ్వాలని భావి

వార్డ్ మెంబర్‌గా గెలవడం కూడా చేతకాదు.. ఎమ్మెల్సీని చేశాం: బుద్ధా వెంకన్న
, సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (14:07 IST)
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని.. అందుకే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయ్యి చూపిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీంతో టీడీపీ బీజేపీకి కటీఫ్ ఇవ్వాలని భావిస్తున్న వేళ.. ఏపీ బీజేపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

ఎప్పుడూ రెండెకరాల రైతును అంటోన్న ఏపీ సీఎం చంద్రబాబుకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు. 
 
ఏకంగా సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. కేంద్ర నిధులు రాష్ట్రంలో స్వార్థ పరులకు ఆదాయ వనరులుగా మారాయని వీర్రాజు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కనీసం వార్డ్ మెంబర్‌గా గెలవడం కూడా చేతకాని సోము వీర్రాజును ఎమ్మెల్సీగా చేసింది టీడీపీనేనని తెలిపారు. 
 
వీర్రాజు వైకాపాకు ఎంతకు అమ్ముడుపోయారని అడిగారు. టీడీపీ అవినీతి పార్టీ అని విమర్శిస్తున్న వీర్రాజు... అవినీతి పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్‌ను వీర్రాజు ఎందుకు విమర్శించడం లేదని నిలదీశారు. ఆయనది బీజేపీ అజెండానా? లేక వైసీపీ అజెండానా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబును విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశ్మీర్ బాలికపై మత్తుమందిచ్చి అత్యాచారం.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్.. ఆపై?