Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం.. బాలయ్య ఆ టైప్.. జగన్‌ను కలుస్తా!: విష్ణు కుమార్

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని.. మే 15వ తేదీకి తర్వాత అన్నీ వ

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (19:23 IST)
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని.. మే 15వ తేదీకి తర్వాత అన్నీ విషయాలను బహిర్గతమనవుతాయని తెలిపారు.


దమ్ముంటే కేసులు పెట్టాల్సిందిగా కొందరు టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారని.. త్వరలోనే వారి కోరిక తీరుస్తామని విష్ణుకుమార్ రాజు అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని ఫైర్ అయ్యారు. అంతేగాకుండా రూ.9,300 కోట్లను ఏపీకి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. 
 
అయితే తెలుగుదేశం పార్టీ తీసుకునేందుకు సిద్ధంగా లేదని.. తద్వారా ఏపీ ప్రజలకు టీడీపీ స్వార్థ ప్రయోజనాల కోసం అన్యాయం చేస్తుందని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. 30వ తేదీన చంద్రబాబు చేపట్టనున్న దీక్ష కూడా స్వార్థపూరితమైనదే అని అన్నారు. చెప్పిందే చెబుతూ ముఖ్యమంత్రి అందరికీ బోర్ కొట్టిస్తున్నారని తెలిపారు.

ఈసారి మాట్లాడేటప్పుడు ఒక ఆర్కెస్ట్రా కూడా పెట్టించాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేపట్టిన దీక్షతో రూ. 20 నుంచి 30 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమయిందని చెప్పారు. అలాగే పాదయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ విశాఖపట్నం చేరుకున్నాక... తన మామగారి కోసం జగన్‌ను కలుస్తానని విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
అలాగే ప్రధాని మోదీపై నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దుయ్యబట్టారు. జనాల్ని చూస్తే బాలయ్య రెచ్చిపోతారని ఎద్దేవా చేశారు. బాలయ్య నోటిదురుసుతనంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments