Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబుకి పవన్‌కి మధ్య ఆ సంబంధం వుందని ఏపీ ప్రజలు ఆ పని చేశారు... రావెల కిశోర్

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (21:02 IST)
జనసేన పార్టీ నుంచి అలా బయటకు వచ్చి ఇలా భాజపాలో చేరిపోయారు రావెల కిశోర్ బాబు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన నాయకుల్లో తను కీలక నాయకుడునన్న మాటలో నిజం లేదని కొట్టిపారేశారు.
 
అసలు తనకు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంటే దొరికేది కాదన్నారు. కనీసం ఫోనులోనైనా మాట్లాడుదామంటే ఆయన అందుబాటులో వుండేవారు కాదన్నారు. ప్రజలు జనసేన గురించి ఏమనుకుంటున్నారో చెప్పేందుకు కూడా సమయం కుదర్లేదంటూ చెప్పుకొచ్చారు. తన సూచనలు, సలహాలు ఆయన తీసుకున్న పరిస్థితులు కూడా లేనేలేవన్నారు. 
 
వైసీపి గెలవడానికి కారణం గురించి చెపుతూ... చంద్రబాబు నాయుడు-పవన్ కల్యాణ్ మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతూనే వున్నాయని ప్రజలు నమ్మారన్నారు. చంద్రబాబును పవన్ విభేదిస్తున్నట్లు జనం అనుకోలేదనీ, ఒకవేళ పవన్ కల్యాణ్‌కి ఓట్లు వేస్తే ఎక్కడ మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారోనన్న భయంతో వాళ్లంతా కలిసి వైసీపిని బంపర్ మెజారిటీతో గెలిపించారని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments