రోజమ్మకి కీలక పదవి ఇవ్వాలి... ఎలా? సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచన

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (20:45 IST)
వైసీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆర్కే రోజాకి ఖచ్చితంగా పదవి వస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమెకి పదవి రాకుండా పోయింది. నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజాకు మంత్రివర్గంలో చోటు దక్కక పోవడంతో ఆమె ఖంగుతిన్నారు. దీంతో శనివారం ఉదయం జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారానికి కూడా రాలేదు. పైగా, ఆమె అలకపాన్పుఎక్కి, కనిపించకుండా పోయారు.
 
దీంతో రోజాను బుజ్జగించేందుకు స్వయంగా వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రంగంలోకి దిగి బుజ్జగించారు. చివరకు ఆర్టీసీ ఛైర్మన్ పదవిని ఇస్తామని హామీ ఇచ్చినా రేపోమాపో దాన్ని ప్రభుత్వం విలీనం చేస్తున్న నేపధ్యంలో ప్రాధాన్యత అంత వుండదని రోజా వెనకడుగుకు వేసినట్లు తెలుస్తోంది. 
 
అయితే, రోజా ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేపథ్యంలో, గెలిచిన అభ్యర్థులు ఇలాంటి నామినేటెడ్ పదవులు చేపట్టడంలో రాజ్యాంగపరమైన అడ్డంకులను వైసీపీ అధినాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి కూడా రోజా ముందు ఓ ఆప్షన్‌లా ఉంచారని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ రోజాకున్న పాపులారిటీ నేపధ్యంలో మరీ చిన్నపదవులుగా తోచడంతో ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. మరి ఆమెకి ఎలాంటి పదవి ఇస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments