Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ మొహం పెట్టుకుని కేంద్రాన్ని జోక్యం చేసుకోవాలని అడుగుతావు: బీజేపీ నేత జివిఎల్

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (09:30 IST)
ఏపీ బీజేపీ నేతలు ఓవైపు టీడీపీ ఆఫీస్ లపై జరిగిన దాడుల్ని ఖండిస్తూనే మరోవైపు చంద్రబాబు పై విమర్శలు కురిపించారు. ఏ మొహం పెట్టుకుని కేంద్రాన్ని  జోక్యం చేసుకోవాలని అడుగుతావు అని ప్రశ్నించారు. ఒకరిద్దరు నేతలు టైమ్ చూసుకుని కాస్త గట్టిగానే బాబుని తగులుకున్నారు. 
 
ఎంపీ జీవీఎల్ పూర్తిగా బాబు నోరు మూయించినంత పని చేశారు. గతంలో బాబు చేసిన కుట్రలన్నిటినీ బయటపెట్టారు. ఒకరకంగా వైసీపీ కంటే ఎక్కువగా జీవీఎల్ ఈ విషయంలో రియాక్ట్ అయ్యారు, బాబుని ఇరుకున పెట్టారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో లాభపడిన చంద్రబాబు.. ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పి చివర్లో ప్రత్యేక హోదా అంటూ ఎలా డ్రామాలు ఆడారో అందరికీ తెలిసిందే.

ఆ క్రమంలో కేంద్రంతో చంద్రబాబు యుద్ధాన్ని ప్రకటించారు. కేంద్ర మంత్రులెవరూ ఏపీలో అడుగు పెట్టకూడదని హుకుం జారీ చేశారు. తిరుపతిలో అమిత్ షా పై రాళ్లు వేయించారు. ప్రధాని మోదీని బండబూతులు తిట్టారు, తిట్టించారు. మోదీ పర్యటనకు వస్తే నల్ల గుడ్డలతో నిరసన చేపట్టారు.

కేంద్రాన్ని అంతలా ద్వేషించి, అసలు కేంద్ర ప్రభుత్వమే వేస్ట్ అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు అదే కేంద్రాన్ని దేహీ అని వేడుకోవడం హాస్యాస్పదం అని అన్నారు జీవీఎల్.

సీబీఐకి ఎంట్రీ లేదని రెచ్చిపోయిన బాబు.. ఇప్పుడు ఏపీ పోలీసులు వేస్ట్.. కేంద్ర బలగాలు రంగంలోకి దిగాలని ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారని ప్రశ్నించారు. మోదీ బ్యానర్లు చించివేయించి, మసిపూసి నిరసన చేపట్టిన బాబు, ఏ మొహంతో అదే మోదీకి లేఖ రాశారని అడిగారు.

అప్పుడు కేంద్రంతో బాబుకి పనిలేదని, ఇప్పుడు ఏపీలో పార్టీ పరిస్థితి బాగోలేదు కాబట్టి కాళ్లబేరానికి వస్తున్నాడని, చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి అని విమర్శించారు. గతంలో ఏపీలో జరిగిన పరిణామాలను టీడీపీ మరచిపోయినా, బీజేపీ మరచిపోలేదన్నారు జీవీఎల్. మోదీకి లేఖ రాసి శరణు కోరే ముందు.. ఆయనకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments