Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కిలారు దిలీప్ కుమార్ కామెంట్స్..

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (13:45 IST)
గత రెండు మూడు రోజులుగా బెంజ్ సర్కిల్ వద్ద కార్మికలు పడే ఇబ్బందులు చూసి వారిని పరమర్శించాలని భావిస్తే పోలీసులు మాకు అక్కడకు వెళ్ళడానికి అవకాశం కల్పించలేదు అని.. ఈ కార్మికులు బాధలు వర్ణతీతం అని.. తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని విజయవాడ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కిలారు దిలీప్ కుమార్ అన్నారు.

ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రోజుకు ఒకపూట మాత్రమే వారు భోజనం చేస్తున్నారన్నారు. ఇదివరకు వారికి 700 రోజికి కూలి ఇస్తే ప్రస్తుతం 300 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. కార్మికులలో ఈ మధ్యకాలంలో ముగ్గురు చనిపోయారని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మరీనా తర్వాత కార్మికులకు తిండి లేకుండా చేస్తే ఈ ప్రభుత్వం ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ప్రశ్నించారు. కార్మికులు ఇసుక లేక రోడ్డున పడ్డారనీ, కార్మికుల వారి ఇంటికి వెళ్లకుండా రోడ్డున పడ్డారనీ, రక్తం అమ్ముకొని కార్మికులు జీవిస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్రానికి లేఖ రాస్తామని తెలిపారు. వీరందరికి రెండు మూడు రోజులలో న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇసుక పాలసీపై జగన్మోహన్ రెడ్డి మూడు నెలలు పాటు తాత్సారం ఎందుకు చేశారని ప్రశ్నించారు. రేపు ఇసుక పాలసీపై ఫైనల్ చేసి ఎల్లుండి కల్లా అందుబాటులోకి తీసుకొని రాకపోతే ప్రధాని నరేంద్ర మోడీకి రిప్రజెంటేషన్ చేస్తామని తెలిపారు. 
 
అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు అని జనవరి 6 నాడు  6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ పుస్తకం రిలీజ్ చేశారు. మీరు చేసిన ఆ బుక్ నిజమైతే ఈ మూడు నెలల్లో ఎక్కడైనా అవినీతి పట్టుకొని అరెస్టులు చేశారా అని ప్రశ్నించారు. కేవలం ప్రజలను మోసం చేయడానికి మాత్రమే మీరు ఈ బుక్ రీలేజ్ చేశారా అంటూ నిలదీశారు.

ఇసుక విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి ఏమిటి మీరు చేయని అవినీతి ఏమిటని ప్రశ్నించారు. అవాస్తావలను ప్రచారం చేసి ఓట్లు వేసుకున్నారనీ, గతంలో ట్రాక్టర్ ఇసుక 3 వేలు అమ్మితే ఇప్పుడు 7 వేలు నుండి 10 వేలు వరకు కొన్ని చోట్ల అమ్ముతున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి 6 నెలలు సమయం ఇవ్వాలని భావిస్తే ఆయన చేసే తప్పులు మీద తప్పులు చేయడంతో ఖండించడం జరుగుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments