Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వహిస్తా : బండారు దత్తాత్రేయ

Webdunia
సోమవారం, 2 సెప్టెంబరు 2019 (16:40 IST)
కొత్త బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. 
 
తాజాగా ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించిన విషయం తెల్సిందే. బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గానూ, తెలంగాణ రాష్ట్రానికి తమిళనాడుకు చెందిన బీజేపీ చీఫ్ తమిళిసై సౌందరాజన్ నియమితులయ్యారు. 
 
తన నియామకంపై బండారు దత్తాత్రేయ స్పందిస్తూ, కష్టపడి పనిచేసినవారికి తగిన గుర్తింపు ఉంటుందనడానికి తన నియామకమే నిదర్శనమన్నారు. పార్టీ తనకు గతంలో అప్పజెప్పిన పలు బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించానని, అదేరీతిలో నూతన బాధ్యతలను సైతం నిర్వర్తిస్తానని చెప్పారు. 
 
తనకు గుర్తింపునిచ్చి.. గవర్నర్‌గా అవకాశం ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాతోపాటు బీజేపీ సీనియర్ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. దత్తాత్రేయకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుసహా పలువురు ఫోన్‌చేసి శుభాకాంక్షలు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments