Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాడె కట్టాలి : వామపక్ష నేతల పిలుపు

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (12:52 IST)
రాష్ట్ర ప్రజలకు తీవ్ర ద్రోహం చేయడమే కాకుండా, తొమ్మిదేళ్ల విజయోత్సవ వేడుకల పేరుతో సభలు నిర్వహిస్తూ, ప్రజలను మరోమారు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి ఏపీ ప్రజలు పాడెకట్టాలని వామపక్ష పార్టీ నేతలు పిలుపునిచ్చారు. 
 
సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో బీజేపీ 9 ఏళ్ల విద్రోహ పాలనను నిరసిస్తూ ఆదివారం విశాఖ డీఆర్ఎం కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని రకాలుగా ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. ఇది చాలక విజయోత్సవం పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖలో సభ నిర్వహించడం సిగ్గుచేటన్నారు. 
 
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేది లేదని అమిత్ షా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్, కొత్త కార్మిక చట్టం రద్దు వంటి నిర్ణయాలను తక్షణమే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments