Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాడె కట్టాలి : వామపక్ష నేతల పిలుపు

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (12:52 IST)
రాష్ట్ర ప్రజలకు తీవ్ర ద్రోహం చేయడమే కాకుండా, తొమ్మిదేళ్ల విజయోత్సవ వేడుకల పేరుతో సభలు నిర్వహిస్తూ, ప్రజలను మరోమారు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి ఏపీ ప్రజలు పాడెకట్టాలని వామపక్ష పార్టీ నేతలు పిలుపునిచ్చారు. 
 
సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో బీజేపీ 9 ఏళ్ల విద్రోహ పాలనను నిరసిస్తూ ఆదివారం విశాఖ డీఆర్ఎం కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని రకాలుగా ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. ఇది చాలక విజయోత్సవం పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖలో సభ నిర్వహించడం సిగ్గుచేటన్నారు. 
 
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేది లేదని అమిత్ షా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్, కొత్త కార్మిక చట్టం రద్దు వంటి నిర్ణయాలను తక్షణమే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటీనటులకు ప్రభుత్వం ఏమి చేయాలో చెప్పనవసరం లేదు- సిద్ధార్థ్

ప్రణీత్ హనుమంతుపై ఫైర్ అయిన సుధీర్ బాబు.. చీడపురుగు అంటూ?

ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా చిత్రం.. స్పిరిట్‌లో కొరియన్ యాక్టర్?

ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో బుట్టబొమ్మ

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పనస పండు ఆరోగ్య ప్రయోజనాలు

వెల్లుల్లి వాసన పడదా.. మహిళలు రెండు రెబ్బలు తింటే?

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

తర్వాతి కథనం
Show comments