Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందువులను కించపరిస్తే సహించం : సీఎం జగన్‌కు సోము వీర్రాజు వార్నింగ్

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (13:56 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు గట్టి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలోని హిందూ ప్రజలను చులకనగా చూస్తే సహించబోమని హెచ్చరించారు. 

సమాజంలో ఉండే అందరినీ హిందువులు గౌరవిస్తారని, హిందువులు మతతత్వ వాదులు కారని స్పష్టం చేశారు. బీజేపీపై దాడి చేస్తే హిందువులపై దాడి చేసినట్టేనని అన్నారు. ఈ అంశంపై తాము ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, హిందువులను మతతత్వ వాదులుగా చిత్రీకరించడం పట్ల రథయాత్రలతో ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

ఏపీలో గతకొంతకాలంగా జరుగుతున్న ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటలనపై బీజేపీ ఫిబ్రవరి 4 నుంచి రథయాత్ర చేపడుతోంది. వారం రోజుల పాటు సాగే ఈ యాత్ర తిరుపతి కపిలతీర్థం నుంచి విజయనగరం జిల్లా రామతీర్థం వరకు నిర్వహిస్తారు. 

ఈ యాత్రకు జనసేన కూడా మద్దతిస్తోంది. నెల్లూరు, శ్రీశైలం, గుంటూరు, విజయవాడ, అంతర్వేది, పిఠాపురం వంటి ప్రాంతాల మీదుగా ఈ రథయాత్ర రామతీర్థం చేకుంటుంది. కాగా, ఇటీవల తిరుపతిలో బీజేపీ నిర్వహించిన యాత్రపై పోలీసులు లాఠీ ఝుళిపించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments