కిరణ్ రాయల్ బాధితురాలు కిలేడీనా?.. చెన్నై మీదుగా జైపూర్‌కు తరలింపు...

ఠాగూర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (08:39 IST)
జనసేన పార్టీ తిరుపతి ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసిన లక్ష్మి అనే మహిళపై పలు మోసం కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో గత 2021లో లక్ష్మిపై కేసు నమోదైవుంది. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా కిరణ్ రాయల్‌పై లైంగిక, మోసం ఆరోపణలు చేసిన లక్ష్మిరెడ్డి చేశారు. ఈ వార్త సంచలనం కావడంతో పాటు విలేకరులతో ఆమె మాట్లాడుతున్న దృశ్యాలు టీవీల్లో వచ్చాయి. టీవీల్లో లక్ష్మిరెడ్డిని గుర్తించిన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ పోలీసులు.. సోమవారం తిరుపతికి వచ్చి ఆమెను అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత ఆమెను చెన్నై మీదుగా జైపూర్‌కు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత తిరుపతి మొదటి అదనపు సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిస్ట్ అరెస్టు వారెంట్‌ ఉండటంతో లక్ష్మిరెడ్డిని జైపూర్ పోలీసులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అయితే, తనకు ప్రాణహాని ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులను తోడుగా తీసుకెళ్లేందుకు కోర్టు అవకాశం కల్పించింది. 
 
కాగా, క్రిప్టో కరెన్సా వ్యవహారంలో 2021లో జైపూర్, చంద్వాది పోలీస్ స్టేషన్‌లో లక్ష్మిరెడ్డిపై కేసు నమోదైవుంది. అప్పటి నుంచి ఆమె పరారీల ఉన్నారు. మీడియాలో లక్ష్మిరెడ్డిని గుర్తించి తిరుపతికి వచ్చిన జైపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

కేజీఎఫ్ విలన్ హరీష్ రాయ్ ఇకలేరు

సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మారా, ది గర్ల్ ఫ్రెండ్ స్ఫూర్తినిచ్చింది - హేషమ్ అబ్దుల్ వహాబ్

NtR: ప్రశాంత్ నీల్ చిత్రం షెడ్యూల్ కు సిద్ధం అవుతున్న ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం