Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాకు షాక్ : సొంత గూటికి చేరిన మహ్మద్ ఇక్బాల్

వరుణ్
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (14:40 IST)
ఎన్నికలకు ముందు ఏపీలోని అధికార వైకాపాకు మరో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వైకాపాను వీడారు. ఈయన తిరిగి సొంత పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
 
గత కొంతకాలంగా వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు ఆ పార్టీని వీడుతున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే మహ్మద్ ఇక్బాల్ కూడా పార్టీని వీడారు. కాగా, ఆయన నేపథ్యం పరిశీలిస్తే, ఆయన ఓ మాజీ ఐపీఎస్ అధికారి. గతంలో చంద్రబాబుకు ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేశారు. ఆ తర్వాత కాలంలో ఆయన టీడీపీలో చేరారు. ఆనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైకాపా తీర్థం పుచ్చుకోగా, ఆయన సీఎం జగన్ ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారు. 
 
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా తరపున హిందూపురం అసెంబ్లీ టిక్కెట్‌ను ఆశించగా, జగన్ మొండిచేయి చూపించారు. పైగా, హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా, ఆయనకు ఇతర పదవులేవీ కేటాయించలేదు. అప్పటి నుంచి ఇక్బాల్ వైకాపా కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల వైకాపాకు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇపుడు మళ్లీ సొంతగూటికి చేరుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments