Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీకి షాక్.. ఆ నలుగురు బీజేపీ గోడ దూకారు.. బాబు పరిస్థితి?

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (19:13 IST)
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాలేకపోయిన టీడీపీలో వుండి చేసేదేమీ లేదనుకున్న ఆ నలుగురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధికారంలో వుండగా కీలక నేతలుగా వ్యవహరించి ఆ నేతలు ప్రస్తుతం గోడ మీద పిల్లిలా బీజేపీలో చేరిపోయారు. దీంతో తెదేపాకు షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు తెదేపాను వీడుతున్నట్లు ప్రకటించారు. 
 
ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. తమను ప్రత్యేకమైన గ్రూప్‌గా పరిగణించాలంటూ ఎంపీలు సీఎం రమేశ్‌, సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌ రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ అందజేశారు. తెదేపాను విభేదించి బయటకు వచ్చామని.. ఆ పార్టీతో ఇకపై తమకు ఎలాంటి సంబంధం లేదని రాజ్యసభ ఛైర్మన్‌కు అందజేసిన లేఖలో ఎంపీలు పేర్కొన్నారు. 
 
తెదేపా నుంచి మాత్రమే తాము దూరమయ్యామని.. ఎంపీలుగా మిగిలిన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని ఎంపీలు తమ లేఖలో వివరించారు. నలుగురు ఎంపీల రాజీనామాతో రాజ్యసభలో తెదేపా బలం రెండుకు పడిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్‌ మాత్రమే మిగిలారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: వీరమల్లు నుంచి తారతార... రొమాంటిక్ సాంగ్ విడుదలైంది

ఎమిరైట్స్ ఫ్లైట్స్‌లో నా చిత్రం ఉంటుంది, ఇప్పుడు మంచి కామెడీ లేదనే బాధ వుంది: డా. రాజేంద్ర ప్రసాద్

వర్జిన్ బాయ్స్: యూత్ ని ఫిదా చేస్తున్న పెదవుల తడి సాంగ్ !

దేశం కోసం తపన ఆపరేషన్ సింధూర్ సాంగ్ లో కనిపించింది : జెడి లక్ష్మీనారాయణ

త్రివిక్రమ్ - చెర్రీ కాంబినేషన్‌లో మూవీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

తర్వాతి కథనం
Show comments