Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీకి షాక్.. ఆ నలుగురు బీజేపీ గోడ దూకారు.. బాబు పరిస్థితి?

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (19:13 IST)
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాలేకపోయిన టీడీపీలో వుండి చేసేదేమీ లేదనుకున్న ఆ నలుగురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధికారంలో వుండగా కీలక నేతలుగా వ్యవహరించి ఆ నేతలు ప్రస్తుతం గోడ మీద పిల్లిలా బీజేపీలో చేరిపోయారు. దీంతో తెదేపాకు షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు తెదేపాను వీడుతున్నట్లు ప్రకటించారు. 
 
ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. తమను ప్రత్యేకమైన గ్రూప్‌గా పరిగణించాలంటూ ఎంపీలు సీఎం రమేశ్‌, సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌ రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ అందజేశారు. తెదేపాను విభేదించి బయటకు వచ్చామని.. ఆ పార్టీతో ఇకపై తమకు ఎలాంటి సంబంధం లేదని రాజ్యసభ ఛైర్మన్‌కు అందజేసిన లేఖలో ఎంపీలు పేర్కొన్నారు. 
 
తెదేపా నుంచి మాత్రమే తాము దూరమయ్యామని.. ఎంపీలుగా మిగిలిన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని ఎంపీలు తమ లేఖలో వివరించారు. నలుగురు ఎంపీల రాజీనామాతో రాజ్యసభలో తెదేపా బలం రెండుకు పడిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్‌ మాత్రమే మిగిలారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments