Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో వైకాపా ఖేల్‌ఖతం : టీడీపీలో చేరనున్న జగన్ పార్టీ కార్పొరేటర్లు

ఠాగూర్
మంగళవారం, 18 మార్చి 2025 (13:02 IST)
విశాఖపట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు అధికార టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం వారంతా వైజాగ్ నుంచి అమరావతికి చేరుకున్నారు. ఇప్పటికే విశాఖ నగర పాలక సంస్థకు చెందిన 12మంది కార్పొరేటర్లు వైకాపాను వీడి కూటమి చెంతకు చేరగా మరో 9 మంది కార్పొరేటర్లు మంగళవారం టీడీపీలో చేరనున్నారు. 
 
వీరిలో చల్లా రజని, గేదెల లావణ్య, సునీత, భూపతిరాజు సుజాత, ముర్రు వాణిలతో పాటు మరో నలుగురు కార్పొరేటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి 29 మంది కార్పొరేటర్లు గెలవగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైకాపా నుంచి 11 మంది నేరుగా టీడీపీలో చేరారు. 
 
అలాగే, జనసేన పార్టీకి ముగ్గురు కార్పొరేటర్లు ఉండగా, వైకాపా, స్వతంత్రలుగా గెలిచిన ఏడుగురు జనసేన పార్టీలో చేరారు. బీజేపీ నుంచి ఒక కార్పొరేటర్ గెలవగా, ఇటీవల వైకాపా నుంచి మరొకరు ఆ పార్టీలో చేరారు. దీంతో కూటమి బలం 52కు చేరింది. తాజాగా మరో తొమ్మిది మంది కార్పొరేటర్లు టీడీపీలోకి రావడంతో కూటమి బలం 61కు చేరింది. 
 
మొత్తం 98 మంది కార్పొరేటర్ స్థానాలు ఉన్న విశాఖ మున్సిపాలిటీలో ప్రస్తుతం 97 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. జీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన దానికంటే ఎక్కువ మంది కార్పొరేటర్లు టీడీపీ కూటమికి ఉండటంతో 19వ తేదీన వైకాపాకు చెందిన మేయర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ కార్పొరేటర్లు ప్రవేశపెట్టనున్నారు. కూటమి బలం వివరాలతో జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు వారంతా లేఖ రాశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments