Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింత‌మ‌నేనికి హైకోర్టులో ఊరట-తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ స్టే

Webdunia
బుధవారం, 4 మే 2022 (16:34 IST)
చింత‌మ‌నేనిపై న‌మోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో టీడీపీ సీనియ‌ర్ నేత‌, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌కు బుధ‌వారం హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు స్టే విధించింది. 
 
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీల‌కు నిర‌స‌న‌గా టీడీపీ 'బాదుడే బాదుడు' పేరిట నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది. ఈ నిర‌స‌న‌ల్లో భాగంగా పాల్గొన్న సంద‌ర్భంగా చింత‌మ‌నేని ఘాటు వ్యాఖ్య‌లు చేశారంటూ చింత‌ల‌పూడి పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా చింత‌మ‌నేనిపై చింత‌ల‌పూడి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేశారు. 
 
ఈ కేసును స‌వాల్ చేస్తూ చింత‌మనేని హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌పై బుధవారం నాడు విచార‌ణ చేప‌ట్టిన కోర్టు... ఈ కేసులో త‌దుప‌రి చర్య‌లు చేప‌ట్ట‌వద్దంటూ స్టే విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments