Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో సాఫీగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (10:55 IST)
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో పోలింగ్‌లో భాగంగా, ఏపీలోని శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్టణం, ప్రకాశం - నెల్లూరు - చిత్రూ, కడప - అనంతపురం - కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
 
అలాగే, ప్రకాశం- నెల్లూరు - చిత్తూరు, కడప - అనంతపురం - కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలు, వెస్ట్ గోదావరిలో రెండు, శ్రీకాకుళం, కర్నూలలో ఒక్కొక్కటి చొప్పున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు పోలింగ్ సాఫీగా సాగుతోంది.
 
అదేవిధంగా తెలంగాణాలో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ సాగుతోంది. కాగా, ఏపీలో అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన ఐదు స్థానిక సంస్థల నియోజకవర్గ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమైన విషయం తెల్సిందే. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల16వ తేదీన సాయంత్రం వెల్లడిస్తారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments