Webdunia - Bharat's app for daily news and videos

Install App

టచ్ చేసి చూడండి అంటున్న భూమా అఖిలప్రియ.. ఆ స్కెచ్‌తో ఎ.వి.సుబ్బారెడ్డి..?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (20:30 IST)
కర్నూలు జిల్లాలో ఎ.వి.సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ కుటుంబం మధ్య జరుగుతున్న తగాదా అంతా ఇంతా కాదు. ఇద్దరూ టిడిపిలోనే ఉన్నా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వారి కుటుంబంలో ఉంది. ఏకంగా ఎ.వి.సుబ్బా రెడ్డి హత్యకు ప్లాన్ కూడా భూమా అఖిలప్రియ చేసిందంటూ ఎస్పీని కలిసింది ఎవి సుబ్బారెడ్డి కుటుంబం.
 
ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి భూమా అఖిలప్రియతో పాటు హత్యకు ప్లాన్ చేసింది మరో ఆరుమంది ఉన్నారని వారందరినీ వెంటనే అరెస్టు చేయాలంటున్నారు. ఇందులో భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ కూడా ఉన్నాడంటున్నారు ఎవి సుబ్బారెడ్డి. తన కుమార్తె జశ్వంతిని వెంటపెట్టుకుని వచ్చిన సుబ్బారెడ్డి తనకు న్యాయం చేయాలంటున్నాడు.
 
అయితే సొంత పార్టీ నేతల మధ్యే ఈ గొడవ జరుగుతుండటం ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. అయితే తననూ ఎవరూ టచ్ చేయలేరంటోంది అఖిలప్రియ. నన్ను గానీ, నా కుటుంబాన్ని టచ్ చేసే ధైర్యం ఉందా అంటూ తన అనుచరులతో బహిరంగానే చెబుతున్నారు భూమా అఖిలప్రియ. మొత్తం మీద కర్నూలులో వీరి మధ్య జరుగుతున్న రచ్చ కాస్త రాజకీయ వేడిని పుట్టిస్తోంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments