Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతి విషయంలో గొడవ - విద్యార్థిని బంధించి చిత్ర హింసలు

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (10:45 IST)
భీమవరంలో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువతి విషయంలో గొడవపడిన కొందరు ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన అంకిత్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఓ యువతి విషయంలో నలుగురు విద్యార్థులు అంకిత్‌తో గడవపడ్డారు. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీన అంకిత్‌ను హాస్టల్‌లోని తమ గదికి పిలిచి అతన్ని బంధిచి కర్రలతో చావబాదారు. ఆపై ఇస్త్రీపెట్టెతో వాతలు పెట్టారు. తనను విడిచిపెట్టాలని బాధిత విద్యార్థి ప్రాధేయపడినా వారు ఏమాత్రం కనికిరించలేదు. 
 
యువకుడిని చితకబాదుతుండగా ఇతర విద్యార్థులు తీసిన వీడియో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు స్పందించారు. దాడికి పాల్పడిన ప్రవీణ్, నీరజ్, స్వరూప్, ప్రేమ‌లపై కేసు నమోదుచేశారు. వీరందా శ్రీకాకులళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం. మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన కాలేజీ యాజమాన్యం ఆ నలుగురు విద్యార్థులతో పాటు వివాదానికి కారణమైన యువతిని కూడా కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments