Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి విమానాశ్రయంలో పరుగులు పెట్టిన బండ్ల గణేష్... బ్లేడు బండ్లా అంటూ...

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (20:21 IST)
తెలంగాణా రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశాడు నిర్మాత బండ్ల గణేష్. తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం ఖాయమని జోస్యం చెప్పారాయన. అయితే ఈ నెల 11వ తేదీన జరిగిన కౌంటింగ్‌లో కారు వేగానికి కాంగ్రెస్ హస్తం జావగారిపోయింది. దీంతో అప్పటి నుంచి బండ్ల గణేష్ మీడియాకు కనిపించకుండా తిరుగుతున్నారు. తన ఇంటిలోనే కాకుండా తన సన్నిహితులు ఇంటిలో కూడా లేకుండా ఒక రహస్య ప్రదేశాన్ని ఎంచుకుని దాక్కున్నారు.
 
అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించారు బండ్ల గణేష్. కుటుంబ సమేతంగా ఆయన తిరుపతికి వచ్చారు. బండ్ల గణేష్‌ను చూసిన టాక్సీ డ్రైవర్లు బ్లేడ్ ఎక్కడ అంటూ గట్టిగా అరిచారు. దీంతో గణేష్ ముఖంలో ఆందోళనకర వాతావరణం కనిపించింది. పరుగెత్తికెళ్ళి కారులో కూర్చున్నారు బండ్ల గణేష్. వైకుంఠ ఏకాదశి కావడంతో రేపు తిరుమల శ్రీవారిని బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా దర్శించుకునే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments