మాజీ సీఈసీ మృతిపట్ల గవర్నర్ బండారు సంతాపం

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (14:49 IST)
కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ గాలి వెంకట గోపాల కృష్ణమూర్తి మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపాన్ని వ్యక్తం చేశారు. జీవీజీ కృష్ణమూర్తి మృతి తనను బాధను కలిగించిందన్నారు. న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఎన్నో కీలక కేసులను వారు వాదించారని తెలిపారు. గతంలో వారు భారతీయ న్యాయ సంఘంలో మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారని, కేంద్ర ఎన్నికల సంఘం కమిషనరుగా కూడా పనిచేశారని వారి సేవలను దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు. 

1992లో తానూ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు గాలి వెంకట గోపాల కృష్ణమూర్తితో తనకు వారితో అనుబంధం ఏర్పడిందని, తాను  కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు తనకు కృష్ణమూర్తి అనేకమైన సలహాలు సూచనలు అందించేవారని, మృదుస్వభావి, స్నేహశీలి అయిన కృష్ణమూర్తి సేవలు ఎనలేనివని బండారు దత్తాత్రేయ కొనియాడారు. ఆ మహానుభావుడి మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments