Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో హాట్ టాపిక్‌గా మంత్రివర్గ మార్పు

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (15:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గం మార్పుపై రసవత్తరంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 11వ తేదీన తర్వాత రాష్ట్రానికి కొత్త మంత్రులు రాబోతున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి పేర్ని నాని కూడా స్పష్టం చేశారు. దీంతో కొత్త మంత్రులు ఎవరన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 
 
ఈ పరిస్థితుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు, ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ఏపీ మంత్రివర్గ విస్తరణ సీఎం అభీష్టం మేరకే జరుగుతుందన్నారు. కొత్త మంత్రులు ఎవరన్న అంశంపై తుది నిర్ణయం ఆయనే తీసుకుంటారని చెప్పారు. 
 
మరోవైపు, వైకాపా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మంత్రివర్గ విస్తరణ స్వాగతిస్తున్నాం. నేను మంత్రిపదవి రేసులో లేను. దయజేసి నా పేరును మంత్రిపదవి రేసులో ఉన్నాననే ప్రచారం చేయద్దు. జిల్లాలో బీసీ వ్యక్తికి కాకుండా అగ్రకులంలో ఉన్న నాకు మంత్రి పదవి ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. బొత్స సత్యనారాయణను మంత్రిగా కొనసాగించాలని కోరుతున్నాం. నేను నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే కట్టుబడి ఉన్నాను. జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి పెడతాను అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments