Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా సభ్యులు సహనం కోల్పోయి దాడి చేస్తే : అసెంబ్లీలో సీఎం జగన్

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (11:52 IST)
సభలో తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు పట్టుమని పది మంది కూడా లేరు. కానీ, వారి ప్రవర్తన వీధి రౌడీల కంటే దారుణంగా ఉంది. మా సభ్యులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. సవాళ్లు విసురుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మా సభ్యులు సహనం కోల్పోయి తెదేపా సభ్యులపై దాడి చేస్తే ఆ ఘటనను రాజకీయం చేసి లబ్ది పొందాలని చూస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ అన్నారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, బుధవారం తెదేపా సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ సభాపతి పోడియను చుట్టుముట్టారు. ఈ చర్యపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు మొత్తం కలిపి 10 మంది కూడా లేరని, ప్రజాస్వామ్యాన్ని కించపర్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 
 
సభాపతిని అగౌరవపరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. దీంతో వైసీపీ నేతలు రెచ్చిపోయి దాడి చేస్తే.. ఆ ఘటనను రాజకీయం చేసి లబ్ధిపొందే దిక్కుమాలిన పార్టీ టీడీపీ అని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సంస్కారం లేని ఇలాంటి వ్యక్తులు సభకు ఎందుకు వస్తున్నారో? అర్థం కవడంలేదని అన్నారు. 
 
సభ్యులు స్పీకర్‌ పోడియం రింగ్‌ దాటి వస్తే మార్షల్స్‌ ఎత్తుకెళ్లే పరిస్థితి తీసుకురావాలని సభపతికి సూచించారు. టీడీపీ సభ్యులు 10 మంది ఉన్నారు.. వీళ్ల కంటే వీధి రౌడీలు చాల బెటర్‌ అని జగన్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు, అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనివుంది. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించివున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments