Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు ఆటో డ్రైవర్ .. ఇపుడు ఆటో సర్పంచ్ .. ఎవరు?

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (12:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నాలుగు దశల్లో ప్రశాంతంగా ముగిశాయి. దీంతో అనేక మంది సామాన్యులు ఇపుడు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఇలాంటి వారిలో వివిధ వృత్తులు చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నవారు ఉన్నారు. ఈ క్రమంలో నిన్నామొన్నటివరకు ఆటో డ్రైవరుగా ఉన్న వ్యక్తి ఇపుడు ఆటో సర్పంచ్‌గా మారిపోయాడు. దీనికి కారణం.. గ్రామపంచాయతీ ఎన్నికలే. 
 
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జంగాలిపాలెం సర్పంచ్‌ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీ చేసిన గొరపల్లి నరసింగరావు మూడో ప్రయత్నంలో విజయం సాధించాడు. అతడు 1995 నుంచి టీడీపీ కార్యకర్త. చిన్న చిన్న పనులు చేసుకునేవాడు. 
 
2006 నుంచి ఆటో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉండేవాడు. 2006, 2013లో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. 
 
అయినా నిరాశ చెందకుండా తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీచేసి 94 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. పంచాయతీలోని 8 వార్డులకుగాను ఆరు టీడీపీ మద్దతుదారులే కైవసం చేసుకున్నారు. దీంతో ఆ గ్రామంలో తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments