Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 7న ఆసెట్‌ పరీక్ష

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (09:11 IST)
ఆంధ్ర యూనివర్సిటీలో 2020-21 విద్యా సంవత్సరానికి ఎంఎ, ఎంకాం, ఎమ్మెస్సీలో ప్రవేశాలకు నిర్వహించే ఆసెట్‌-2020 పరీక్షలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.  జులై 5వ తేదీ తుది గడువని ఎయు ప్రవేశాల సంచాలకులు ఆచార్య డిఎ.నాయుడు తెలిపారు.

ఒసి అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్‌సి అభ్యర్ధులు రూ.500 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలని తెలిపారు. జులై 10వ తేదీ లోపు వెయ్యి రూపాయలు అపరాధ రుసుముతో ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

జులై 25 నుంచి వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఎయు ఇంజినీరింగ్‌ కళాశాలలో అర్హులైన అభ్యర్థులు ఆరేళ్ళ ఇంజినీరింగ్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌ ద్వారా జులై 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

జులై 10వ తేదీ లోపు రూ.1500 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశముందని తెలిపారు. దరఖాస్తు, ప్రోసెసింగ్‌ రుసుము రూ.1200, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్‌సి అభ్యర్థులైతే రూ.1000 రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

జులై 25వ తేదీ నుంచి వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు పొందవచ్చని తెలిపారు. ఆగస్టు 7న ఎంట్రన్స్‌ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments