Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుచ్చకాయల వ్యాపారిపై దాడి: వీఆర్‌లోకి పోలీసులు

Webdunia
శనివారం, 8 మే 2021 (11:28 IST)
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం, ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సైతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్‌లోకి పంపుతూ పోలీసు శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. లాక్‌డౌన్‌ అమల్లో భాగంగా ఒకటో పట్టణ ఎస్సై వెంకటేశ్వర రావు, సిబ్బంది గురువారం రాత్రి గస్తీ తిరుగుతుండగా పల్నాడు రోడ్డులో నరసయ్య అనే పుచ్చకాయల వ్యాపారి దుకాణం తీసి ఉండటాన్ని గుర్తించారు.

కర్ఫ్యూ అమల్లో ఉండగా రాత్రి సమయంలో దుకాణం ఎందుకు తీశావని పోలీసులు ప్రశ్నించగా వ్యాపారి వారితో దురుసుగా వ్యవహరించాడు. దీంతో విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు వ్యాపారిని స్టేషన్‌కు రమ్మని చెప్పగా అందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుళ్లు సదరు వ్యక్తిపై చేయిచేసుకున్నారు. అనంతరం పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తరలించారు.

దుకాణం వద్ద జరిగిన గొడవ అంతా సీసీ కెమెరాలో నమోదైంది. శుక్రవారం ఉదయం దుకాణం వద్దకు వచ్చిన వ్యాపారి సీసీ కెమెరాలో నిక్షిప్తమైన వీడియోను పోలీసు ఉన్నతాధికారులకు పంపాడు. స్పందించిన ఉన్నతాధికారులు ఎస్సై మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వేశారు. ముగ్గురిని వీఆర్‌లోకి పంపూతూ ఎస్పీ కార్యాలయం నుంచి ఉత్తర్వులొచ్చాయని డీఎస్పీ విజయ భాస్కరరావు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments