Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా బారినపడి కరోనాని జయించిన పోలీస్: విధులకు ఆహ్వానించిన ఎస్పీ

Advertiesment
Corona conquered
, శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (21:12 IST)
రెండవ దశ కరోనా ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఫ్రెంట్ లైన్ లో ఉన్న పోలీసులు కొందరు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. గుంటూరు అర్బన్ ఎస్పి గారు స్వయంగా  సిబ్బంది ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి వారికి ధైర్యం చెప్పటంతో పాటు వారిలో మనోధైర్యం నింపడమే కాకుండా వారి ఆరోగ్య పరిరక్షణకు అధికారులను నియమించి వారి బాగోగులపై  ఎప్పటికప్పుడు ఆరా తీశారు.

వారికి, వారి కుటుంబ సభ్యులకు, అండగా ఉంటాం అని భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే.అంతే కాకుండా మందుల సరఫరా పౌష్టిక ఆహారం వంటివి ఇళ్లకు వెళ్లి సిబ్బందిని పరామర్శించి స్వయంగా వారికి అందచేశారు. కరోనా నుండి కోలుకుని తిరిగి విధులకు హాజరు అయ్యే వారందరిని కాన్ఫరెన్స్ హాల్‌కి పిలిపించి ఫ్రూట్స్ మరియు ఫ్లవర్ బోకేలతో ఘనస్వాగతం పలికారు.

సిబ్బంది ఎవరూ మనోధైర్యం కోల్పోవద్దు దృఢ సంకల్పంతో ఉండాలని సూచించారు. ఇంత త్వరగా కోలుకుని కరోనపై  తిరిగి యుద్ధానికి సిద్ధం అయిన మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అనునిత్యం సిబ్బందికి అండగా ఉండి ఒక నిండు భరోసా కల్పించిన ఎస్పి గారికి సిబ్బంది అందరూ కృతజ్ఞతలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపిలో 24 గంటల్లో 17,354 కేసులు, చిత్తూరు జిల్లా అగ్రస్థానం