Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ సమాచారం.. ప్రభుత్వ సలహాదారుల పోస్ట్‌లపై సభలో రగడ

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (12:29 IST)
సలహాదారుల నియామకంలో సామాజిక రిజర్వేషన్ పాటించారా అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని
ప్రశ్నించారు. ఆర్ధిక సంక్షోభం ఉందని.. రూపాయి జీతం అంటున్న ప్రభుత్వం ఇంత మంది సలహా దారులను ఎందుకు తీసుకున్నారని ఆయన అడిగారు. 
 
సలహాదారులు నియామకాల్లో ఎంత మంది బీసీలు ఉన్నారన్న టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్..70 మంది నియామకాల్లో ఒకే వర్గానికి ఎలా అవకాశం ఇస్తారా అని టీడీపీ ప్రశ్నించింది. 
 
మరోవైపు సచివాలయం ఫైర్‌ స్టేషన్‌ వద్ద టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు నల్లబ్యాడ్జీలతో నిరసన చేశారు. ఇందులో బాలకృష్ణ, ఇతర నేతలు
 
మంగళగిరి నుంచి సచివాలయం బస్టాప్‌ వరకు బస్సులో ప్రయాణం చేపట్టారు. పల్లెవెలుగు బస్సులో నారా లోకేశ్ సచివాలయం బస్టాప్‌కు వచ్చారు. ఈ సందర్భంగా  దీపక్‌రెడ్డి, అశోక్‌బాబు పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. 
 
అసెంబ్లీ జరిగేటప్పుడు సభ అభిప్రాయం తీసుకోకుండా ఆర్టీసీ ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. ఇది గర్వంతో కొవ్వెక్కి తీసుకున్న నిర్ణయం తప్ప మరొకటి కాదని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
 
ఎన్నికల ముందు ఏమీ పెంచేది లేదని చెప్పి.. రోజుకో సమస్య ప్రజలపై మోపుతున్నారు, ఆర్టీసీ ఛార్జీల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments