అసెంబ్లీ సమాచారం.. ప్రభుత్వ సలహాదారుల పోస్ట్‌లపై సభలో రగడ

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (12:29 IST)
సలహాదారుల నియామకంలో సామాజిక రిజర్వేషన్ పాటించారా అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని
ప్రశ్నించారు. ఆర్ధిక సంక్షోభం ఉందని.. రూపాయి జీతం అంటున్న ప్రభుత్వం ఇంత మంది సలహా దారులను ఎందుకు తీసుకున్నారని ఆయన అడిగారు. 
 
సలహాదారులు నియామకాల్లో ఎంత మంది బీసీలు ఉన్నారన్న టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్..70 మంది నియామకాల్లో ఒకే వర్గానికి ఎలా అవకాశం ఇస్తారా అని టీడీపీ ప్రశ్నించింది. 
 
మరోవైపు సచివాలయం ఫైర్‌ స్టేషన్‌ వద్ద టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు నల్లబ్యాడ్జీలతో నిరసన చేశారు. ఇందులో బాలకృష్ణ, ఇతర నేతలు
 
మంగళగిరి నుంచి సచివాలయం బస్టాప్‌ వరకు బస్సులో ప్రయాణం చేపట్టారు. పల్లెవెలుగు బస్సులో నారా లోకేశ్ సచివాలయం బస్టాప్‌కు వచ్చారు. ఈ సందర్భంగా  దీపక్‌రెడ్డి, అశోక్‌బాబు పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. 
 
అసెంబ్లీ జరిగేటప్పుడు సభ అభిప్రాయం తీసుకోకుండా ఆర్టీసీ ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. ఇది గర్వంతో కొవ్వెక్కి తీసుకున్న నిర్ణయం తప్ప మరొకటి కాదని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
 
ఎన్నికల ముందు ఏమీ పెంచేది లేదని చెప్పి.. రోజుకో సమస్య ప్రజలపై మోపుతున్నారు, ఆర్టీసీ ఛార్జీల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి.. బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'

Nagavamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది: సూర్యదేవర నాగవంశీ

Devi Sri Prasad: ఎల్లమ్మ తో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం

రాహుల్ సిప్లిగంజ్ పాట, ఆనీ మాస్టర్ డాన్స్ తో ట్రెండింగ్‌లో అమీర్ లోగ్ సాంగ్

Arjun: అర్జున్ చిత్రం సీతా పయనం నుంచి బసవన్న యాక్షన్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం

అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్

హైదరాబాద్‌లో తమ 25 ఏళ్ల కార్యకలాపాలను వేడుక జరుపుకున్న టిబిజెడ్-ది ఒరిజినల్

ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

తర్వాతి కథనం
Show comments