Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కుల ధరలు పైపైకి..! మంగళగిరిలో నిలువుదోపిడి

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (14:09 IST)
అనుకున్నదే అయింది. కరోనా అనుమానిత కేసు నేపథ్యంలో మాస్కులు ధరలకు రెక్కలు వచ్చాయి. రూ.2 నుంచి రూ.5కే దొరికే సాధారణ మాస్కుల ధరలను మందుల దుకాణదారులు ప్రజలకు అందుబాటులో లేని ధరలకు అమ్ముతున్నారు. ఒక్కో మాస్కును రూ.20 నుంచి రూ.25కు అమ్ముతున్నారు. 
 
మరోవైపు కృత్రిమ కొరత సృష్టిస్తూ డిమాండ్‌కు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల నుంచి మాస్క్‌లు, హ్యాండ్‌వాష్‌ శానిటైజర్‌లకు డిమాండ్ పెరిగిపోతోంది. ఒక్కోసారి వీటి కోసం తిరగని మందుల దుకాణం అంటూ ఉండడం లేదు. ఒక్కోషాపునకు రోజుకు పదుల సంఖ్యలో ప్రజలు వీటి కోసం తిరుగుతున్నారు. 
 
జిల్లా ఔషధ నియంత్రణాధికారులు ఇటీవల కంటి తుడుపుగా దాడులు చేసి మిన్నకుండిపోయారు. దాడులు జరిగినా యధావిధిగా మాస్కులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మరోవైపు శానిటైజర్లు అయితే అసలు దొరకని పరిస్థితి నెలకొంది. కరోనా ప్రభావం పడడంతో శానిటైజర్ల వాడకం ఎంతో కీలకంగా మారుతోంది. 
 
కాగా, అధికారులకు అందిన సమాచారం మేరకు పట్టణంలో 40 మంది వరకు విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నట్లు తెలిసింది. వారి వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేగాక కరోనా కేసుతో మరింత విస్త్రతంగా సర్వే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments