Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేపటి నుండి చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

రేపటి నుండి చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత
, గురువారం, 19 మార్చి 2020 (13:08 IST)
కరోనా వైరస్ నివారణలో భాగంగా రేపటి నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేయనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పంతులు తెలిపారు. కోవిడ్ 19 వైరస్(కరోనా వైరస్) కారణంగా మార్చి 19 నుండి 25వ తేదివరకు ఆలయాన్ని మూసివేస్తున్నామని అన్నారు. 
 
అయితే ఈ వారం రోజులు.. స్వామి వారి ఆరాధన రోజు జరుగుతుంది కానీ భక్తులకు మాత్రం అనుమతి లేదని ఆయన అన్నారు. దేవాలయ అర్చకులు పవన్ ఈ విషయంపై మాట్లాడుతూ ప్రధాన అర్చకుల ఆదేశాల మేరకు రేపటి నుండి ఆలయం మూసి ఉంటుందని చెప్పారు. 
 
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, హాస్టళ్లు మూసి వేయడం జరిగిందని,  వైరస్ ప్రభావం ఉన్నందున దేవాలయాన్ని కూడా మూసివేస్తున్నామని అన్నారు.
 
ఈ నిర్ణయంపై దేవాలయానికి వచ్చే భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. గుడికి చాలా మంది భక్తులు  వస్తారని అందువలన వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని చెప్పారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచానికి ఇటలీ నేర్పిన గుణపాఠం.. ఓ ఇటలీ పౌరుడి ఆవేదన