Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ వేళ పొలం పనుల్లో నిమగ్నమైన వైకాపా ఎంపీ

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (16:39 IST)
కరోనా వైరస్ దెబ్బకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో ప్రజాప్రతినిధులంతా తమతమ ప్రాంతాలకే పరిమితమయ్యారు. అయితే, మరికొందరు మాత్రం తమతమ సొంత పనులను చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి వారిలో వైకాపాకు చెందిన అరకు లోక్‌సభ సభ్యురాలు గొడ్డేటి మాధవి ఒకరు. ఈమె తన సొంత పొలం పనుల్లో నిమగ్నమైవున్నారు. 
 
తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే గుడి దేవుడి నుంచి సంక్రమించిన భూమిలో ఆమె స్వయంగా దుక్కిదున్ని విత్తనాలు జల్లి పొలం పనుల్లో పాల్గొన్నారు. స్వగ్రామమైన శరభన్న పాలెం నుంచి నిమ్మగడ్డ వెళ్లే దారిలో ఉన్న తమ భూమిలో భౌతికదూరం పాటిస్తూ, ఆమె పొలం పనులు చేస్తున్న చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వ్యవసాయ పనులు చేయడం తనకు అలవాటేనని, కొత్తకాదని చెప్పుకొచ్చారు. లాక్డౌన్ కారణంగా తన నియోజకవర్గానికే పరిమితం కావాల్సివచ్చిందని, అందువల్ల తాను పొలం పనుల్లో బిజీగా కాలం వెళ్లదీస్తున్నట్టు చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments