Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ వేళ పొలం పనుల్లో నిమగ్నమైన వైకాపా ఎంపీ

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (16:39 IST)
కరోనా వైరస్ దెబ్బకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో ప్రజాప్రతినిధులంతా తమతమ ప్రాంతాలకే పరిమితమయ్యారు. అయితే, మరికొందరు మాత్రం తమతమ సొంత పనులను చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి వారిలో వైకాపాకు చెందిన అరకు లోక్‌సభ సభ్యురాలు గొడ్డేటి మాధవి ఒకరు. ఈమె తన సొంత పొలం పనుల్లో నిమగ్నమైవున్నారు. 
 
తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే గుడి దేవుడి నుంచి సంక్రమించిన భూమిలో ఆమె స్వయంగా దుక్కిదున్ని విత్తనాలు జల్లి పొలం పనుల్లో పాల్గొన్నారు. స్వగ్రామమైన శరభన్న పాలెం నుంచి నిమ్మగడ్డ వెళ్లే దారిలో ఉన్న తమ భూమిలో భౌతికదూరం పాటిస్తూ, ఆమె పొలం పనులు చేస్తున్న చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వ్యవసాయ పనులు చేయడం తనకు అలవాటేనని, కొత్తకాదని చెప్పుకొచ్చారు. లాక్డౌన్ కారణంగా తన నియోజకవర్గానికే పరిమితం కావాల్సివచ్చిందని, అందువల్ల తాను పొలం పనుల్లో బిజీగా కాలం వెళ్లదీస్తున్నట్టు చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments