Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోనే తొలిసారి.. ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఈ- పోస్ యంత్రాల వినియోగం

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (11:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. దూరప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ఈ-పోస్ యంత్రాలను వినియోగించాలని నిర్ణయించింది. ఈ తరహా యంత్రాలను ఉపయోగించడం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. వీటి వినియోగానికి పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడ, గుంటూరు-2 డిపోలను ఎంచుకున్నారు. 
 
ఈ డిపోల నుంచి చెన్నై, తిరుపతి, విశాఖపట్టణం, హైదరాబాద్, బెంగుళూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో వీటిని వినియోగించనున్నారు. ఇప్పటికే గత మూడు రోజులుగా వీటిని వినియోగిస్తున్నారు. ప్రయాణికులతో పాటు ఆస్టీసీ సిబ్బంది నుంచి వచ్చే స్పందన ఆధారంగా వీటిని మరిన్ని బస్సుల్లో వినియోగించే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటారు. అదేసమయంలో ఈ మిషన్ల వినియోగంపై కండక్టర్లు, డ్రైవర్లకు కూడా శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. 
 
ఈ మిషన్ల ద్వారా అన్ని రకాల డిజిటల్ చెల్లింపులు అంటే ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కానింగ్, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా టిక్కెట్ ధర చెల్లించుకోవచ్చు. అదేసమయంలో నగదు చెల్లించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ మిషన్లను వినియోగించడం ద్వారా చిల్లర సమస్యకు ఫుల్‌స్టాఫ్ పడుతుందని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments