ఏపీలో ప్రారంభమైన ఆర్టీసీ బస్సు సేవలు...

Webdunia
గురువారం, 21 మే 2020 (10:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ సేవలు గురువారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ కారణంగా గత 60 రోజులుగా డిపోలకే పరిమితమైన ఈ బస్సులు... లాక్డౌన్ సడలింపుల కారణంగా రోడ్డెక్కాయి. మొత్తం 436 మార్గాల్లో 1,683 బస్సులు అంటే 17 శాతం బస్సులు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. 
 
ఈ బస్సుల్లో కేవలం 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నడుపనున్నారు. అయితే, ప్రయాణికులు బస్సెక్కాలంటే మాత్రం కొన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అందులో మొదటిది ఆరోగ్యసేతు యాప్. ప్రతీ ప్రయాణికుడి వద్ద కోవిడ్-19 ట్రాకింగ్ యాప్ ఉంటేనే బస్సులోకి అనుమతిస్తారు.
 
ఇక, ఈ బస్సులు ప్రస్తుతానికి ఓ బస్టాండు నుంచి మరో బస్టాండుకు మాత్రమే నడుస్తాయి. ఈ బస్సుల్లో ఎటువంటి రాయితీలు వర్తించవు. అవసరం అనుకుంటే ఏసీ బస్సులను నడుపుతామని, 26 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే అందులో ఉంచుతామని అధికారులు తెలిపారు. అటెండర్లు ఉండరని, దుప్పట్లు ప్రయాణికులే తెచ్చుకోవాల్సి ఉంటుందని అన్నారు.
 
ఇక 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని కోరారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బస్సుల్లో కండక్టర్లు ఉండరు. అన్ని బస్సులకు ఆన్‌లైన్‌లోనే టికెట్లు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. కౌంటర్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారు తమ పేరు, ఫోన్ నంబరు ఇవ్వడం తప్పనిసరి చేసింది. 
 
అయితే, 50 శాతం ప్రయాణికులతో ఈ బస్సులను నడుపనున్న దృష్ట్యా ప్రయాణ ఛార్జీలు పెంచుతారనే ప్రచారం సాగుతోంది. దీనిపై రాష్టర రవాణా శాఖా మంత్రి పేర్ని నాని స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ నష్టం వాటిల్లినా ప్రయాణికులపై మాత్రం భారం మోపబోమని, సాధారణ బస్సు చార్జీలతో 50 శాతం ప్రయాణికులతోనే బస్సులను తిప్పుతామని తెలిపారు. కాగా, తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుబాయ్‌లో ప్రశాంతంగా వుంది: మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ

'ఉస్తాద్ భగత్ సింగ్' రీమేక్ మూవీ కాదు : దర్శకుడు హరీశ్ శంకర్

దుబాయ్‌లో చిక్కుకున్న సినీ తారలు.. మంచు విష్ణు ఫ్యామిలీ దుబాయ్‌లో క్షేమంగా ఉండాలి

తండ్రిని అన్‌ఫాలో చేసిన విజయ్ కుమారుడు జాసన్ విజయ్

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి విశ్వనాథ్- సన్స్ టైటిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments