హ్యాట్సాఫ్ రోజా, ఏం చేశారంటే?

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (17:34 IST)
సినీనటి, ఎమ్మెల్యే రోజా మరోసారి దయాగుణాన్ని చాటుకున్నారు. గత కొన్నిరోజుల ముందు నిండుగర్భిణిగా ఉన్న మహిళ నగరి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం.. ఆసుపత్రిలో అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో తన సొంత కారులో తిరుపతికి గర్భిణిని పంపించారు రోజా. 
 
అయితే మళ్లీ మరోసారి తన దాతృత్వాన్ని చూపారు. కరోనా వైరస్ మహమ్మారిలా మారుతున్న సమయంలోను ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న పారిశుధ్య కార్మికులకు రోజా ప్రతిరోజు భోజనం పెడుతున్నారు. వారికొక్కరికే కాదు పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బందికి రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా భోజనాన్ని అందిస్తున్నారు.
 
అంతేకాకుండా దాతల నుంచి విరాళాలు సేకరించి పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు బియ్యం, పప్పు దినుసులను అందించారు రోజా. నగరిలో ఈరోజు పారిశుధ్య కార్మికులకు ఉచితంగా బియ్యం, నిత్యావసరాలను పంపిణీ చేశారు.
 
విపత్కర పరిస్థితుల్లోను మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులు నిజంగా గొప్పవారని, అలాంటి వారిని ఆర్థికంగా ఆదుకోవడం మన ధర్మమని చెప్పారు రోజా. మరింతమంది దాతలు ముందుకు వచ్చి రోడ్లపై ఉన్న నిరుపేదలు, అనాధలు, అభాగ్యులు, నిరాశ్రయలకు తమ వంతు సహాయం చేయాలని.. కడుపు నిండా భోజనం పెట్టాలని విజ్ఞప్తి చేశారు రోజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments