Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడది ఇంట్లో... కారు షెడ్డులో... ప్రసాదంలా ఫర్నీచర్... రోజా సెటైర్లు

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (15:21 IST)
గత ప్రభుత్వం మహిళల మాన, ప్రాణాలతో చెలాగాటమాడుకుందని, విద్యార్ధి నుంచి ఎమ్మెల్యే వరకూ అందరినీ వేధించి హింసించారని ఎపిఐఐసి ఛైర్మెన్ రోజా తీవ్రస్ధాయిలో విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ స్పీకర్ కోడెల మహిళల పట్ల వ్యవహరించిన తీరుపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. 
 
ఆడవాళ్ళ తాళిబొట్లు తెగిపడిపోయినా, ఆత్మహత్యలు చేసుకున్నా, కాల్‌మనీ సెక్స్ రాకెట్‌తో హింసించినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. మహిళా సమస్యలపై గళం ఎత్తితే రూల్స్‌కు విరుద్ధంగా తనపై కక్ష సాధింపు చేసారని ఆవేదన వ్యక్తం చేసారు. 
 
నిబంధనకు విరుద్ధంగా నన్ను అన్యాయంగా ఏడాది పాటు సస్పెండ్ చేశారని అన్నారు.
మహిళా కమీషన్ చైర్మెన్‌గా వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న రోజా గత ప్రభుత్వం అడుగడుగునా మహిళలను కించపరుస్తూ, హింసిస్తూ వారి జీవితాలతో ఆడుకుందని విమర్శించారు. 
 
విద్యార్ధుల నుంచి మహిళా అధికారుల వరకూ అందరినీ టిడిపి నేతలు వేధించారని ఆరోపించారు. కాల్ మనీలో ఆడవాళ్లను హింసించిన వారిని చంద్రబాబు వెనకేసుకువచ్చారని అన్నారు. చంద్రబాబు కోడలు మగబిడ్డ కంటే అత్త వద్దంటుందా అని, కోడెల అయితే మరీ దారుణంగా కారు షెడ్డులో వుండాలని, ఆడది ఇంట్లో వుండాలని హేళన చేసారని, మహిళల పట్ల వ్యగ్యంగా, అవమానపరిచే విధంగా మాట్లడ్డాన్ని గుర్తు చేసారు. అసెంబ్లీ దేవాలయం తాను పూజరిని అని చెప్పిన కోడెల ఫర్నిచర్ అంతా ప్రసాదంలా తీసుకెళ్లిపోయారని ఎద్దేవా చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం